mt_logo

గల్ఫ్ బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

యూఏఈ ఆమ్నెస్టీ బాధితులను తెలంగాణకు తీసుకరావడానికి వెళ్లిన ప్రభుత్వ బృందానికి నిన్న దుబాయ్‌లోని, షార్జాలో తెలంగాణ వాదుల నుండి ఘనస్వాగతం లభించింది. ప్రభుత్వ బృంద ఇన్‌చార్జ్ అరవిందర్ సింగ్ తో పాటు మహేష్ బిగాల, రషీద్, చిట్టి బాబు, నర్సింహా నాయుడు పర్యటించారు. ఈ క్యాంపులకు వందలాది మంది హాజరయ్యి వాళ్ల సాధక బాధకాలు విన్నవించారు. ప్రభుత్వ బృందం వాళ్ళు చెప్పిన సమస్యలని పరిష్కరించాలని కాన్సులేటు జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ విపుల్ గారిని కోరగా, విపుల్ గారు ఓపెన్ హౌస్ స్టేడియంలో ప్రభుత్వ బృందంతో పాటు గల్ఫ్ బాదితులందరితో సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో రెండు వందల మంది గల్ఫ్ బాధితులు హాజరయ్యారు.

విపుల్ గల్ఫ్ బాధితులతో మాట్లాడి పాస్పోర్ట్స్ లేని వారికీ త్వరగా పాస్పోర్ట్ ఇప్పిస్తామన్నారు, తెలంగాణకు వచ్చేందుకు అవసరమైన అవుట్ పాసులు లేని వారికీ త్వరగా ఇప్పిస్తామన్నారు. ఆమ్నెస్టీ ద్వారా తెలంగాణకు రావాలనుకునేవారు దాదాపు 500కు పైగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ ప్రతినిధుల బృందం తెలిపింది. వీళ్ళందరికీ సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వం తరుపున విమాన టికెట్లు ఇప్పిస్తారన్నారు. మా సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా తెలంగాణ నుండి దుబాయ్ కి బృందాన్ని పంపిన కేసీఆర్, కేటీఆర్ గారికి తెలంగాణ గల్ఫ్ సోదరులందరూ రుణపడి ఉంటామని తెలంగాణ సంఘం సభ్యులు మరియు ఇతర సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *