mt_logo

రాజీనామాకు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన హరీష్ రావు

మెదక్ రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా.. నువ్వు వస్తావా దమ్ముంటే.. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా ఆని సవాల్ విసిరారు.

రాజీనామా లేఖలను ఇద్దరం మేధావులు చేతిలో పెడదాం. నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్ గారికి ఇస్తారు. చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ గారికి ఇస్తారు.. దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా.. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అని ఛాలెంజ్ చేశారు.

రాకుంటే కొడంగల్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తోక ముడిచినట్టే, ఇప్పుడు ముడుస్తున్నావని తెలంగాణ ప్రజలకు అర్థమవుతది అని హరీష్ అన్నారు.

25 ఏళ్ళగా మెదక్‌లో గులానీ జెండా ఎగురుతున్నది.. వేరే జెండా ఎగురలేదు.. మెదక్ జిల్లా గులాబీ అడ్డా.. మళ్ళీ బీఆర్ఎస్ గెలువబొతున్నది అని పేర్కొన్నారు.

10 ఎండ్లల్ల కేసీఆర్ ఏం చేశాడు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఏం చేశాడు బిడ్డా లిల్లీపుట్.. కేసీఆర్ వల్లనే మెదక్ జిల్లా కేంద్రం అయ్యింది. ఆయన కలెక్టరేట్ కట్టిండు కాబట్టి నువ్వు నామినేషన్‌కు మెదక్‌కు వచ్చావు అని తెలిపారు.

ఇందిరా గాంధీ చేసింది అంటున్నావు.. పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు.. ఇందిరా గాంధీ బీహెచ్ఈఎల్ తెచ్చిందని అబద్ధం ఆడుతున్నారు. 1952లో అది వస్తే, ఇందిరా 1980లో ఎంపీ అయ్యారు అని అన్నారు.

పేగులు మెడలో రాక్షసులు వేసుకుంటారు. సీఎం స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదు. జిల్లాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్.. అందమైన నాలుగు లైన్ రహదారి చేసింది కేసీఆర్ అని హరీష్ గుర్తు చేశారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ అమలు అని బాండ్ పేపర్ మీద రాశారు. బాండ్ పేపర్ పరువు తీశారు.. దేవుళ్ళను రాజకీయాలకు వాడుతున్నారు.. నువ్వు ఎవరి మీద ఓట్లు పెట్టినా నిన్ను నమ్మరు అని తేల్చి చెప్పారు. 

ఆరు హామీలు అమలు కాలేదు.. కానీ చేసినా అంటున్నారు.. ఈ ముఖ్యమంత్రికి నా ఎత్తు గురించి ధ్యాస ఉంది గాని రైతుల సమస్య పట్ల ధ్యాసే లేదు.. 200 పైగా రైతులు చనిపోయారు.. ఆటో కార్మికులు 30 మంది చనిపోయారు.. వారిని పరామర్శించరు.. ఢిల్లీలో తిరుగుతారు అని దుయ్యబట్టారు.

బీజేపీ రఘునందన్ మాటలు నమ్మడమంటే నీళ్లు లేని బావిలో దూకడమే.. దుబ్బాకల అలాగే మాట్లాడితే అక్కడ ప్రజల బుద్ధి చెప్పారు.. బీజేపీ ఏ వర్గాలకు మేలు చేయలేదు ఆని విమర్శించారు.

బీఆర్ఎస్ గెలుపు 6 గ్యారంటీల అమలుకు మలుపు అయితది.. మనం గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వాళ్లను భూమి మీద దించాలంటే వెంకట్రామ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా అని పిలుపునిచ్చారు.

జిల్లాలు ఎక్కువ అయ్యాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి.. మనకు మంచి అభ్యర్థి దొరికిండు.. వెంకటరామరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఒకాయన ఆరో తరగతి, మరొకరు బ్లాక్‌మెయిలర్. బీఆర్ఎస్ నుండి కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తి అని హరీష్ కొనియాడారు.