mt_logo

20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్‌కి గోడు వినిపించిన రైతులు

బస్సు యాత్రలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సును ఆపి నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు తమ గోడు వినిపించారు. గన్నీ బ్యాగుల ప్రదర్శన చేసి.. ఇరవై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నడి ఎండాకాలంల కూడా నీళ్లు మత్తళ్లు దుంకేవి.. మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే.. మల్లా మీ పాలనే రావాలని నినాదాలు చేశారు.

రైతు బంధు లేదు. రూ. 500 బోనస్ అన్నరు అది బోగస్ అయింది. మేము పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరు.. ఇగ బోనస్ ఏమిస్తరు సార్. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యింది.. అని రైతులు గోడువెళ్లబోసుకున్నారు.

పోరాడి సాధించుకుందాం నీళ్లు కరెంటు మల్లా తెచ్చుకుందాం పోరాటానికి సిద్ధంగా ఉండండి అని కౌవేవర్ రైతులకు పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి దగ్గర కేసీఆర్‌ను ఆపి రైతులు ఇదే తరహాలో తమ గోడు వెల్లబోసుకున్నారు.