mt_logo

లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ “తెలంగాణ డెప్యుటీ సీయం కడియం శ్రీహరి”

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (TeNF) మరియు తెలంగాణ జాగృతి యూకే సంయుక్తంగా లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ “తెలంగాణ డెప్యుటీ సీయం కడియం శ్రీహరి” ఘనంగా నిర్వహించారు.

యు.కే నలుమూలల నుండి భారీగా వివిద సంస్థల కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు.

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో…ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి, తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ – తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (TeNF) నాలుగు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణ నిర్మాణదిశలో టి.అర్.ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు, తను లండన్‌లో గత కొన్ని రోజులుగా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు. టి.అర్.ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెలుతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు అహర్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.

ప్రత్యేకించి విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు – విధానాల గురించి సభకు వివరించారు. భవిష్యత్తులో ఎన్నారైలను భాగస్వాములుగా చేసుకొని విద్యారంగంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, కాబట్టి అందరు సహకరించి, అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

GHMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం కాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నారై టి.అర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు శ్రీహరి గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టి.అర్.ఎస్ సెల్‌కి  ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు మరియు యావత్ టి.అర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు. రాబోయే GHMC ఎన్నికల్లో ప్రవాస బిడ్దలందరు, హైదరాబాద్‌లో  నివసించే వారి బందువులు – మిత్రులని టి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాలని కోరారు.

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (TeNF) ఉపాధ్యక్షురాలు పవిత్రారెడ్డి కంది మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర సాధనలో – నేడు పునర్నిర్మాణంలో లండన్‌లోని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ పాత్రని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్నారై విభాగాన్ని త్వరలో ప్రారంభించాలని కడియం శ్రీహరి గారిని కోరారు.

జాగృతి – యూకే అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ … సంస్థ ఆవిర్భావం నుండి చేస్తున్న కార్యక్రమాలని – భవిష్యత్తు కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారిని సన్మానించి – జ్ఞాపిక బహూకరించారు.

కడియం శ్రీహరి గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమంలో ఎన్నారై. టి.అర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇన్చార్జ్ విక్రం రెడ్డి, శ్రీధర్ రావు, లండన్ ఇన్చార్జ్ రత్నాకర్. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (TeNF) ఉపాధ్యక్షురాలు పవిత్రా రెడ్డి కంది, అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇన్చార్జ్ నగేష్ రెడ్డి, జాగృతి – యూకే ఉపాధ్యక్షులు సుమన్ రావు బల్మూరీ. జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అహ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. శ్రీకాంత్ జెల్ల, వినయ్ కుమార్ ఆకుల, సత్య, సృజన్ రెడ్డి చాడా, సతీశ్ బండ, సెరు సంజయ్, మధు సూధన్ రెడ్డి, రాజేష్ వర్మ, సుమ దేవి, శ్వేతా, మీనాక్షి అంతటి, రంగు వెంకట్, స్వాతి, సురేశ్, వాణి, నరేశ్, సంతోష్, శ్రావాణ్ రెడ్డి, పావని కతి, కీషోర్ మునుగాల, గణేశ్, ప్రశాంత్, సాయి రెడ్డి, సలాం ఫరూక్ హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *