దేశంలో విపరీతంగా ధరలు పెరిగిన విషయం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, ఇలా విపరీతంగా ధరలు పెంచేస్తే ఎలా చదువుకొవాలని ప్రశ్నిస్తూ ప్రధానికి ఘాటు లేఖ కూడా రాసింది ఓ ఆరేళ్ళ బాలిక. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1 వ తరగతి చదువుతోంది. ఆమె పెన్సిల్, రబ్బర్ను క్లాస్లో పోగొట్టుకోగా… కొత్త పెన్సిల్ కొనమని తల్లిని అడిగితే ఆమె కీర్తిని పెన్సిల్, రబ్బర్ ధరలు పెరిగిపోయాయి… ప్రతీసారి కొనలేనని ఈ మధ్య తరుచుగా మందలిస్తోంది. అలాగే గత ఆదివారం ఆ చిన్నారీ మ్యాగీ ప్యాకెట్ కొనేందుకు ఐదు రూపాయలతో షాప్కు వెళ్లగా… మ్యాగీ ప్యాకెట్ ధర ఏడు రూపాయలు పెరిగినట్టు షాప్ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ పాప నిరాశతో ఇంటికెళ్లి మళ్లీ కొత్త పెన్సిల్ కోసం మారాం చేయగా తల్లి మందలించింది. దీని అంతటికీ ధరలు పెరగటమే కారణమని గ్రహించిన ఆ చిన్నారి కీర్తి … వెంటనే ధరల పెరుగుదలపై ప్రభాని మోడీకి లేఖ రాసింది. “ ప్రధాన మంత్రి జీ… నాపేరు కీర్తి దూబే. నేను ఒకటో తరగతి చదువుతున్నా. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్ , ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేన పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి ? ఇతర విద్యార్థులు నా పెన్సిల్ను దొంగిలించారు. అని హిందీలో రాసి, తండ్రి విశాల్ దూబేకి ఇవ్వగా… న్యాయవాది అయిన తండ్రి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ లేఖ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
- Congress is selling seats today, it will sell Telangana tomorrow: Minister KTR
- Malakpet IT Tower to create 50,000 jobs in Hyderabad
- IT revolution in Telangana’s Tier-II and Tier-III cities
- Noted spiritualist Chaganti Koteshwar Rao is all praise for Kaleshwaram Project
- Hyper propaganda the hallmark of the BJP
- హైదరాబాద్ మలక్పేటలో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్కు భూమిపూజ చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం.. స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఇమిడి ఉంది: సీఎం కేసీఆర్
- అంగన్వాడీ టీచర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
- A delegation of the Chief Election Commission to arrive in Telangana on Oct 3
- KCR is the champion of farmers’ causes: Minister Harish Rao
- గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్
- తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్
- గ్రేటర్లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
- ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
- రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ