mt_logo

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు… రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించైనా అనంతరం… ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటని, దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు. నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపి, ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *