mt_logo

18 ఏళ్ళు నిండినవారికే కళ్యాణలక్ష్మి..

కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని, వివాహం అవుతున్న నివాసంలో ఒకరు అకౌంట్ నంబర్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని, పెళ్ళికి నెలరోజులముందు ఎంఆర్వోకు లేదా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, మున్సిపాలిటీల్లో నివసించే దళితులకు కూడా వర్తిస్తుందని, ఎక్కడ పెళ్లి చేసుకున్నా రూ. 51 వేలు ఇస్తామని, పేదల కష్టాలు తెలుసుకాబట్టే కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని ఈటెల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *