గత మూడేళ్లుగా జూలై 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద విలువైన వస్తువులను ఉచితంగా పంపిణీ చేసేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చి… రాష్ట్రంలోని వికలాంగులను, విద్యార్ధిని, విదార్దులను, రోగులను ఆదుకుంటున్నారు. మూడేళ్ల క్రితం తన పుట్టిన రోజున కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పథకానికి శ్రీకారం చుట్టి ఆరు అంబులెన్స్లను విరాళంగా ఇచ్చారు. దానికి రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ముందుకు వచ్చి అంబులెన్స్లను విరాళంగా ఇవ్వగా వాటి సంఖ్య 120 కి చేరింది. అలాగే రెండో సంవత్సరం లో తాను వ్యక్తిగతంగా 200కు పైగా కస్టమ్ మేడ్ వాహనాలను వికలాంగుల కోసం విరాళంగా ఇవ్వగా….మళ్లీ ఎంపీలు, శాసనసభ్యులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున వికలాంగుల వాహనాలను విరాళం అందజేశారు. దీంతో వీటి సంఖ్య ప్రస్తుతం 1100లకు చేరింది. ఇక ఈ ఏడాది పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత హోదాలో సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోచింగ్ మెటీరియల్తో కూడిన బైజు పవర్డ్ టాబ్లెట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పెద్దఎత్తున ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం సంతోషంగా ఉందని వెల్లడించిన కేటీఆర్… తన పట్ల వారు కురిపిస్తున్న ఆప్యాయతలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడనని, ‘గిఫ్ట్ ఎ స్మైల్’ నిజంగా తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తి నిస్తోందన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కేటీఆర్ తన అనుచరులు, శ్రేయోభిలాషులకు పిలుపునివ్వగా… ఆ మేరకు పలువురు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ముందుకు వచ్చి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎల్సి శంభీపూర్ రాజు కుత్భుల్లాపూర్ నియోజవకర్గం పరిధిలోని శాపూర్నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోగా నాగర్కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి మూడు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి రూ.8 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. కాగా శాసనసభ్యులు గాంధీ ఆరెకపూడి, చల్లా ధర్మారెడ్డి తమ క్యాంపు కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గతంలో రామవరం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంఎల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కింద కొత్త అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ క్రిశాంక్ రసూల్పురాలో పాఠశాల విద్యార్థులకు రెయిన్కోట్లను పంపిణీ చేశారు మరియు కంటోన్మెంట్లోని మారేడ్పల్లిలోని ప్రత్యేక సామర్థ్యం గల పిల్లల హాస్టల్లో పిల్లలకు పాఠశాల యూనిఫాంలను విరాళంగా అందజేశారు. రాష్ట్ర స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డి గిఫ్ట్ ఎ స్మైల్ ఇనిషియేటివ్ కింద ఇద్దరు వికలాంగులకు కస్టమ్ మేడ్ ‘ఈ-వెహికల్స్’ను అందజేశారు.
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు
- కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్