తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించబోతున్న ‘అంతర్జాతీయ విత్తన సదస్సు’కు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సదస్సులో ‘ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అన్న అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎఫ్ఏవో ఆహ్వానించడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తనరంగానికి విశిష్ఠ గౌరవం లభించినట్టయింది. అంతేకాకుండా దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు హాజరుకానున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తిలో తెలంగాణ అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎలా ఎదిగిందన్న అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఏకకాలంలో అంతర్జాతీయ భాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ప్రసారం కానున్నది. తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎండీ కేశవులును అభినందించారు.
- KTR writes to union ministers on corruption in AMRUT tenders
- Electricity charges likely to be hiked soon in Telangana
- Newly recruited Gurukul teachers yet to receive salaries
- KTR calls for clarity from centre on One Nation – One Election
- In just 9 months, Revanth owes ₹25,000 crore to farmers
- కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడివి?: హరీష్ రావు
- రేవంత్ బంధువులకు అర్హత లేకున్నా అమృత్ టెండర్లు కట్టబెట్టారు: కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
- స్టేషన్ ఘన్పూర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్
- గాంధీ ఆసుపత్రి మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ: కేటీఆర్
- బీఆర్ఎస్పై ఎదురుదాడి పక్కన పెట్టి.. పాలనా లోపాలను సరిదిద్దుకోండి: కాంగ్రెస్కు కేటీఆర్ హితవు
- కేసీఆర్పై రేవంత్ దూషణలు అతని దిగజారుడుతనానికి నిదర్శనం: ఖర్గేకి, రాహుల్ గాంధీలకు హరీష్ రావు లేఖ
- బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్టులను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు
- వాళ్లేమైనా దొంగలా, ఉగ్రవాదులా.. రైతు నాయకుల అరెస్టుపై కేటీఆర్ ధ్వజం
- బీసీల కోసం బీఆర్ఎస్ కదిలింది.. నవంబర్ 10 తర్వాత పోరాటమే: కేటీఆర్
- కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ఎంఎస్ఎంఈల అభివృద్ధి: కేటీఆర్