mt_logo

ఎంపీ అరవింద్ పై పసుపు రైతుల ఆగ్రహ జ్వాలలు

నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ లోని నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నిరసన చేపట్టి, ఎంపీ రాకను అడ్డుకున్నారు. తనను గెలిపిస్తే గంటల వ్యవధిలోనే పసుపు బోర్డ్ తెస్తానన్న అరవింద్ మాటతప్పారని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… అరవింద్ రాసిచ్చిన బాండు పేపరు రికార్డులను చూపిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అలాగే మూతపడ్డ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, మక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *