mt_logo

ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను లాంచ్ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

దేశంలోనే ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను లాంచ్ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో ఐఎన్ఎఐ మరియు అప్లయిడ్ ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఆధ్వర్యంలో ‘బోధ్యాన్’ ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం 2020ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌గా ప్రకటించిందన్నారు. కోవిడ్ పాండమిక్‌లో ఏఐ కీలకపాత్ర పోషించిందన్నారు. విద్యార్థుల కోసం స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో కూడ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తామన్నారు. ఏఐ మీద వర్క్ చేసే స్టార్టప్స్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాజన్నసిరిసిల జిల్లాలోని వీరన్నపల్లిలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో కూడిన మాడ్యూల్స్‌ను వాడుతున్నామన్నారు. రోడ్డు సెఫ్టీ కోసం సహాయం అందిస్తున్న ఇంటెల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. మానవ జీవితంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కామన్ మ్యాన్‌కు ఉపయోగపడే టెక్నాలజీ తీసుకు రావాలని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. భారత్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిస్టిట్యూట్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అని ప్రశంసించారు. అలాగే ట్రిపుల్ ఐటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *