ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను వెంకయ్య అభినందించారు. బుధవారం హైదరాబాద్ లోని మాదాపూర్లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) ఆధ్వర్యంలో 15వ ‘గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్’ జరిగింది. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. గతేడాది గుణపాఠాలను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నియమాలు పాటిస్తూ మనల్ని, మన సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమని చెప్పారు. కోవిడ్ నివారణకు కేంద్రం రెండు కొత్త వ్యాక్సిన్ లు, యాంటీ వైరల్ డ్రగ్స్ కి ఇటీవల అనుమతిచ్చిందన్నారు. కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైద్యులదేనని సూచించారు. దేశంలో రోజురోజుకు మెడికల్ టూరిజం పెరుగుతోందని, గ్రామీణ ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్న ఉప రాష్ట్రపతి.. అర్బన్ ప్రాంతాల్లో ప్రపంచ దేశాల నుంచి మన దగ్గరికి రోగులు వస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు అందక ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. టెలి మెడిసిన్ సేవలద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని వెంకయ్య అన్నారు. ఆన్లైన్ కన్సల్టేషన్, ఆన్ లైన్ మెడిసిన్ డెలివరీ సేవలు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మెషిన్ ద్వారా రోగుల మెడికల్ రికార్డ్స్ ని డిజిటల్ చేయవచ్చని చెప్పారు. సీపీఆర్ ద్వారా హార్ట్ అటాక్ వంటి సమయాల్లో మనుషులను కాపడుకోగలమని, వీటిని పాఠశాల స్థాయిలోనే ఫస్ట్ ఎయిడ్ సేవలతో పాటు నేర్పించాలని చెప్పారు. రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో చూపే మానవత్వం, ప్రేమే ముందుగా రోగాన్ని తగ్గిస్తుందన్న విషయాన్ని మరవద్దని ఉపరాష్ట్రపతి అన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్