రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. స్విస్ రే కంపెనీకి ఘన స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ ఆగస్టులో హైదరాబాద్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని చెప్పారు. హైదరాబాద్లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుందది. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్విట్జర్లాండ్లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు
- కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్