mt_logo

తెలంగాణలో కాసులు కురిపిస్తున్న మిర్చి పంట … క్వింటాల్ రూ.32 వేలు

తెలంగాణ మార్కెట్ యార్డుల్లో దేశీ రకం మిర్చి పంట కాసులు కురిపిస్తోంది. గురువారం వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ. 32 వేలు పలికింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 వేల బస్తాలు మార్కెట్ కు రాగా, ఆశించిన ధర కంటే ఎక్కువ ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్‌ జిల్లా గణపురం మండలం కర్కెపల్లికి చెందిన మునగాల భిక్షపతి అనే రైతు 10 బస్తాలు తీసుకురాగా… కాకతీయ ట్రేడర్స్‌ అడ్తి ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్‌ ఖరీదు వ్యాపారి అత్యధికంగా 32వేలకు కొనుగోలు చేశాడు. ఒక్కసారిగా తన పంటకు అత్యధిక ధర రాగా ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్‌ రాహుల్‌ మిర్చి రైతు భిక్షపతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొస్తే గిట్టుబాటు ధరలు పొందవచ్చని వారు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *