mt_logo

తెలంగాణలో ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ… అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో మరో భారీ సంస్థ ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లాలో 500 కోట్ల పెట్టుబడితో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవనుంది. ఈ సందర్భంగా మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫౌండర్ ఎడవల్లి యుగేందర్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టర్లీలో ఒకటైన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండడం గర్వకారణంగా ఉందంటూ, పరిశ్రమకు సంబంధించిన ఫోటోలను పొందుపర్చారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. భూమిపూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రైల్ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు ఇక్కడ తయారు చేయనున్నారు. 1984లో మేధా సంస్థ ఆవిర్భవించి, గడిచిన 15 ఏళ్ల పాటు ఇండియన్ రైల్వే ఆమోదం, గుర్తింపు పొందేందుకు చాలా కృషి చేసినట్లు మేధా సంస్థ యాజమాన్యం పేర్కొంది. 2005లో సుమారు 25 కోట్ల టర్నోవర్‌తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గడిచిన 17 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో నాలుగైదు ఖండాల్లో మేథా సంస్థ విస్తరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *