mt_logo

తెలంగాణ పథకాలు భేష్ : హిమాచల్ ప్రదేశ్ సీఎస్

తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి దోహదపడే పథకాలు అమలు చేస్తోందన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎస్ శ్రీరామ్ సుభాగ్ సింగ్. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయుటకు ఆయా రాష్ట్రాల నుండి వివరాలు సేకరిస్తున్నఆయన, సోమవారం తెలంగాణ సచివాలయం బీ.ఆర్.కే.ఆర్ భవన్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలంగాణ రాష్ట్ర వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి విజన్ కు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాగ్ షిప్ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సూచనల మేరకు ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.యం. రిజ్వీ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *