mt_logo

రాజస్థాన్ అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాను సందర్శించారు. అజ్మీర్‌లోని ఖ్వాజా మోహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించి చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా దర్గా పెద్దలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని ఆమె మత పెద్దలకు వివరించారు. కేసీఆర్‌ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం పుష్కర్‌, శ్రీనాథ్‌జీ దేవాలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించి పూజలు చేశారు. ఆమె వెంట బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి అయేషా, కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఆజం అలీ, కుద్దూస్‌, నవీద్‌ ఇక్బాల్‌, అలీం తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *