mt_logo

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

రానున్న గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించైనా అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వస్తుంటారన్నారు. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కాగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమని, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *