mt_logo

డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరిశీలించారు. త్వరలో లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూంలు అందించనున్న నేపథ్యంలో ఆయన భవన సముదాయాలను స్వయంగా పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌, గ్రీనరి, రోడ్లు, కాలువలు తదితర వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రకాశ్‌నగర్ వంతెన వద్ద కొనసాగుతున్న గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ పనులను కూడా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ మరియు ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *