దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే… మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సినీ నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారు. అనంతరం ఆ గ్రామ రూపురేఖలే మారిపోయే విధంగా గ్రామంలో సిమెంట్ రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్, దిమ్మెలతో.. చెట్లను పెంచి గ్రామంలోని వీధులన్నీ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. తాజాగా ఈ గ్రామం అభివృద్ధి ఫోటోలను మదుసూధన్ రావు అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈ గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి మంచి పురోగతి సాధించారని మంత్రి కేటీఆర్ కొనియాడారు.

