హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ శుభదినం అని పేర్కొన్నారు. మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత హైదరాబాద్లో నీటి అవసరాలు 37 టీఎంసీలు.. 2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 34 టీఎంసీల అవసరం ఉంటుంది. దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉంది. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎండకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా హైదరాబాద్ నగరానికి తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుతా కూడా వాటర్ పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్లో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్ల విస్తరించిన తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు.
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది: ఎక్స్లో కేసీఆర్ పోస్ట్
- రేవంత్కు దమ్ముంటే హరీష్ రావు సవాల్కు స్పందించాలి: కేటీఆర్
- 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం.. నేడు దేశానికి ఆదర్శం: హరీష్ రావు
- తెలంగాణకు ఉన్న ఒక్క ఇంటి పార్టీ బీఆర్ఎస్: పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
- బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ: కేటీఆర్
- రేవంత్కు సవాల్ విసిరి.. అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వెళ్లిన హరీష్ రావు