mt_logo

అడవిబిడ్డకు ఆర్థికంగా అండగా నిలిచినా మంత్రి కేటీఆర్

తమ కలలను నిజం చేసుకునే దిశగా పట్టుదలతో ముందుకెళ్లే పేద యువతకు తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక అడుగు అందరికంటే ముందుటారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన హ్యాండ్ బాల్ ప్లేయర్ మ‌డావి కరీనా అంతర్జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించారు. సోమ‌వారం ఆయ‌న‌ ఆర్థిక సహాయం అందించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన క‌రీనా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో చదువుకున్నది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఇప్పటికే ఆమె అనేక రాష్ట్రస్థాయి టోర్నమెంట్ల‌లో పాల్గొని మెడల్స్ సాధించింది. ఆసియా యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ చాంపియ‌న్‌షిప్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి కజకిస్తాన్ లో జరిగే ఈ పోటీల్లో ఆమె పాల్గొనాల్సి ఉండగా, ఆమె కజకిస్తాన్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. కరీనా టోర్నమెంట్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో అంద‌జేశారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు మ‌డావి క‌రీనాతోపాటు ఆమె కుటుంబ స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *