mt_logo

బాలుని వైద్యానికి 4 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి కేటీఆర్

ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పుడూ ముందుంటారు. పేదల వైద్య సహాయానికి భరోసా కల్పిస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్‌ కిడ్నీ మార్పిడి అనివార్యం అయింది. పేద కుటుంబం కావడంతో స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ ను సహాయం చేయమని కోరడంతో, బాలుని వైద్యానికి రూ.4 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేశారు. ఈ ఎల్‌వోసీని బుధవారం టీఆర్‌ఎస్‌ నాయకులు తరుణ్‌ కుటుంబానికి అందజేశారు. అలాగే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జిల్లెల్లకు చెందిన బర్ల పోచయ్య గుండె ఆపరేషన్‌ కోసం రూ.2 లక్షల ఎల్‌వోసీని మంత్రి మంజూరు చేశారు. సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఎల్‌వోసీని బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *