mt_logo

కోస్గి, కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

ఆరు దశాబ్దాల పాటు నిరాదరణకు గురై… తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అన్ని విధాల వెన్నుదన్నుగా నిలవగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొడంగ‌ల్, కోస్గి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల గణనీయ అభివృద్ధి సాధించాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసుపత్రులపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆరు ద‌శాబ్దాల కాంగ్రెస్ పాల‌న‌లో ఆస్ప‌త్రులు అభివృద్ధి చెంద‌లేదని, కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌ర్వాత అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు అభివృద్ధి చేస్తున్నామ‌ని, కొడంగ‌ల్, కోస్గి ఆస్ప‌త్రుల్లో మెడిక‌ల్ స‌దుపాయాలు అభివృద్ధి చేశామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా కొడంగ‌ల్ సివిల్ హాస్పిట‌ల్ 50 బెడ్ల‌కు అప్‌గ్రేడ్ చేశామ‌ని హ‌రీశ్‌రావు త‌న సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌లో ఐసీయూ, ఆప‌రేష‌న్ థియేట‌ర్, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్‌తో పాటు ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించామ‌న్నారు. రూ.5 కోట్ల వ్య‌యంతో అభివృద్ధి చేసిన సీహెచ్‌సీని రేపు ప్రారంభించ‌బోతున్న‌ట్లు హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *