ఒక్కపంట కూడా పండని తన భూమిలో కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు తీస్తూ తన పంటలో కొంత మొత్తాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువరైతు పన్నాల శ్రీనివాస్ రెడ్డి నేటి యువతకు స్ఫూర్తి అని అభినందించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు కాళేశ్వరం జలాలతో తాను పండించే రెండు పంటలనుంచి వచ్చిన ఆదాయాన్ని పంటకు పదివేల రూపాయల’చొప్పున ఆరునెల్లకోసారి సిఎంఆర్ఎఫ్ కు జమ చేయాలనే తలచి, శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందించాడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి రంగం అభివృద్దితో పాటు విద్యుత్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరమన్నారు. అంతే కాకుండా వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారని, ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామని కొనియాడారు. ఈనేపథ్యంలో… శ్రీనివాస్ రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయమని, సిఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంతభాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్పూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని, ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి నా అభినందనలు అని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్