mt_logo

‘పద్మశ్రీ’ మొగిలయ్యకు ఇంటిస్థలం, కోటి రూపాయలు ప్రకటించిన సీఎం కేసీఆర్

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యకు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా మొగిలయ్యకు పద్మశ్రీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. ఈ సందర్భంగా మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించి, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *