mt_logo

దళిత బంధు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది : మంత్రి జగదీష్ రెడ్డి

దళిత బంధు పథకం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని దీన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు 9 కోట్ల 60 లక్షల దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్రానికి ముందు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేండ్లు గడిచినా కుల విక్షత పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దళితబంధు పథకం సామాజిక విప్లవం వలె దళితులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసి ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధి సమన్వయంతో అర్హులకు దళిత బంధు యూనిట్లను అందజేయాలన్నారు. దళితబంధు యూనిట్ల పంపిణి అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ సి కోటిరెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ సహపంక్తి భోజనాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *