mt_logo

నిర్మలాసీతారామన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి హరీష్ రావు

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టాలని కలెక్టర్ ను ఆదేశించడం పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి మాటలు ప్రధాని స్థాయని దిగజార్చే విధంగా ఉన్నాయని, ఆమె మాటలను ఖండిస్తున్నాను అని తెలిపారు. రేషన్ బియ్యం మొత్తం కేంద్రం ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారని, వాస్తవం తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేంద్రం ఇచ్చేది 55 శాతం మాత్రమేనని, మిగతా 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారుడికి పది కేజీల బియ్యం ఇస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 3610 కోట్లు రేషన్ బియ్యం కోసం ఖర్చు చేస్తున్నదని, అలా అని సీఎం గారి ఫోటో పెట్టామంటారా…అని ప్రశ్నించారు. దేశాన్నిపోషించే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణ నుండి పన్నుల రూపంలో 3 లక్షల 65 వేల 797 కోట్లు కేంద్రానికి పోయిందని, కాని కేంద్రం నుండి రాష్ట్రానికి 1 లక్షా 96 వేల 400 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇతర రాష్ట్రాలను పోషించడంలో తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రభుత్వ వాటా ఉందని తెలంగాణ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ ఫోటో పెట్ట గలరా అంటూ ధ్వజమెత్తారు.

కేంద్రం నుంచి వస్తోన్న మంత్రులు అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు.కేంద్ర హోం మంత్రిఅమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదు అబద్దాలు పలికారని, కాని మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని, మేమే అనుమతులు ఇచ్చామని అన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అయిందని, ఆ విషయాన్ని గుర్తించాలని సూచించారు. జాతీయ స్థాయి నేతలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి అబద్దాలు మాట్లాడతరా..ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని వెల్లడించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హెల్త్ సిటీ ఏదని అడిగితే, నేను స్వయంగా ఫోటోలు పెట్టానని, నడ్డా మళ్ళీ నోరు ఎత్తలేదని పేర్కొన్నారు. పట్టపగలు పచ్చి అబద్దాలు మాట్లాడే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు.

ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిర్మలా సీతారామన్ అంటున్నారని, ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదంటే నేను వెంటనే రాజీనామా చేస్తాను..లేదంటే మీరు చేస్తరా..అని హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయుష్మాన్ భారత్ 2021-22 లో తెలంగాణకు 150 కోట్లు మంజూరు చేసింది. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో ఉంది. 26 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది, తెలంగాణలో ఆరోగ్య శ్రీ కింద 90 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతున్నం. 858 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినం. మీరు ఇచ్చింది 150 కోట్లు. మేం ఆయుష్మాన్ భారత్ కింద ఎందుకు 150 కోట్లు విడుదల చేసిండ్రో…ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వాలి. చేరలేదంటే నేను రాజీనామాకు సిద్దం. లేదంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం 505 కోట్లు ఆరోగ్య శ్రీ ఆయుష్మాన్ భారత్ కింద ఖర్చు అయితే ఫస్ట్ క్వాటర్ కింద 40 కోట్లు కేంద్రం రిలీజ్ చేసిందని గుర్తు చేశారు.

గోబెల్స్ ను మించి పోయి అబద్దాలు మాట్లాడుతున్నరు. మీరిచ్చేది 26 శాతం మందికే,మేం ఇచ్చేది 90 శాతం మందికి వైద్య సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా ఇస్తున్నమని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చేది తక్కువ. ఆర్బాటం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీ కింద పది లక్షలు దాకా ఇస్తున్నం. అలాంటింది మీదగ్గర ఉందా పథకం.మీరు ఇచ్చేది 150 కోట్లు ఇచ్చి ఫోటో పెట్టాలంట. మేం 859 కోట్లు ఖర్చు చేస్తున్నం. ఇది కేంద్ర ప్రభుత్వంతో ఆయుష్మాన్ భారత్ చేరుతూ అగ్రిమెంట్ కూడా చూపిస్తున్నం. 18 మే 2021 లో చేరినట్లు అగ్రిమెంట్ ఉందని స్పష్టం చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత దేశం మొత్తం దివాళా తీసిందని, కేంద్రం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లుతోందని విమర్శించారు.

కేంద్రం ఘనత నెంబర్ వన్ ఏంటంటే 2022 లో వరల్డ్ హంగర్ ఇండెక్స్ లో భారత దేశం 101 స్థానంలో ఉంది. బీజేపీ రాకముందు 2014 లో 55 స్థానంలో ఉంది. 8 ఏళ్ల పాలనలో బీజేపీ పుణ్యమాన దేశాన్ని 101 స్థానంలోకి చేర్చిన ఘనత అని అన్నారు.

ఘనత నెంబర్ 2 ఏంటంటే 2014లో బీజేపీ రాకముందు నిరుద్యోగిత 4.9 శాతం ఉంటె అదిప్పుడు 11 శాతానికి పెరిగిందని, ఇదే కేంద్రం సాధించిన ఘనత అని తెలిపారు.

ఘనత నెంబర్ 3 ఏంటంటే ఒక మహిళనే దేశానికి ఆర్థిక మంత్రి ఉన్నరు. ఒక మహిళా మంత్రిగా ఉండి దేశంలోని మహిళల కళ్లల్లో కన్నీరు తెప్పించిన ఘనత మీది. అచ్చే దిన్ అచ్చే దిన్ అన్నరు..పోయిల కట్టేల దిన్ వచ్చింది. దీని కోసం మాట్లాడండి నిర్మలా సీతారామన్… మా గొప్ప తనం 400 సిలిండర్ ధర 1200 కు పెంచినమనని చెప్పుకోండి అని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘనత నెంబర్ 4 – రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నరు.. ఆదాయం రెట్టింపు కాలేదు కాని, పెట్టుబడి పెంచిన ఘనత మీది. 73 రూపాలు పెట్రోల్ ఉండే ధర 100 రూపాయలకు పెరిగింది. పెట్రోల్ డిజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు.

ఘనత నెంబర్ -5 – ప్రపంచ దేశాల ముందు రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. 2014లో డాలర్ కు 63 ఉండే ఇవాళ 83కు పడిపోయింది. ఇది అద్భుతమైన పరిపాలనకు ఇది నిదర్శనం. మీరుఅద్భుతంగా పాలించి ఉంటే ఎందుకు రూపాయి ధర పతనమైందో చెప్పాలి. భారత దేశలో చరిత్రలో ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోలేదన్నారు.

ప్రపంచంలో సగటు పౌరడు తలసరి ఆదాయం స్థానం చూస్తే మన దేశం 144 స్థానంలోకి పడిపోయింది. అదాని మాత్రమే ప్రపంచంలో మూడో స్థానంలో కుబెరుడిగా మారాడు. ఇది వాస్తవం. తెలంగాణలో అభివృద్ధి జకరగలేదు.పరిపాలన బాాగాలేదు. అప్పుల పాలయింది అన్నారు.

నేడు ఏ రంగంలో అయినా దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర సగటు అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం రెండు లక్షల 78 వేల 823 రూాపాయలు ఉండగా, దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేలు ఉందన్నారు. ఏ సూచికలో చూసినా దేశ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉందని, బీజేపీ వాస్తవాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

పార్లమెంట్ లో నిర్మలా గారు చూపిన ఆర్బీఐ లెక్కల ప్రకారం.. డెట్ టూ, జీఎస్డీపీ రేషియోలో తెలంగాణ 23.5 శాతంతో లిమిట్ లోనే ఉందని చెప్పారు. నవంబర్ 30, 2021 నాడు ఈ లెక్కలు చెప్పింది. పంజాబ్ 42, హిమచల్ ప్రదేశ్ 38, వెస్ట్ బెంగాల్ 36.9, ఉత్తరప ్రదేశ్ 36.6, గోవా 33.3,బీహార్ 32.6 శాతం ఉంది. కాని తెలంగాణ 23.5 శాతం ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు అని వివరించారు. కేంద్రం 2014 లో నికర అప్పు 62 లక్షల 42 వేల కోట్లు ఉండగా, ఇవాళ అప్పు ఒక లక్షా 35 వేల 866 వేల లక్షా 52 వేల కోట్లకు పెరిగిందన్నారు.

మేం కొత్త రాష్ట్రం కనుక, నీళ్లు తెచ్చుకోవాలి కనుక అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టామని, నీళ్లు ఇస్తూ బంగారం లాంటి పంటలు పండిస్తున్నమని అన్నారు. కూలీలు చత్తీస్ ఘడ్, బీహార్ నుండి కూలీలు తెస్తున్నమన్నారు. రైతు బంధు,మిషన్ కాకతీయ, 24 గంటల ఉచితవిద్యుత్ వల్లే కదా ఇంత పంట పండుతుంది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది కదా దీన్ని కాదంటరా..అని నిర్మల సీతారామన్ ను ప్రశ్నించారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరిగాయని చెబుతారు. పార్లమెంట్ లో ఓ మాట..ఢిల్లీలో.. ఓమాట..గల్లీలో ఓమాట.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో 2014లో 898 మంది రైతులు చనిపోతే 2020లో 466 మంది చనిపోయారు. తెలంగాణలో సగానికి సగం తగ్గాయని తోమర్ గారు చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి గల్లీలో ఆత్మహత్యలు పెరిగాయని చెప్తరు. మీ కార్యకర్తల చప్పట్లు కోసం అబద్దాలు మట్లాడటం తగునా… ఏది కరెక్ట్.. ఎవరి మాట నిజం. ఈ రకంగా మాట్లాడవచ్చునా..అని హరీష్ రావు మండిపడ్డారు.

రాష్ట్ర పథకాలు కాపీ కొడుతున్నారని తిరిగి మేమె కాపీ కొడుతున్నట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు కేంద్రం పెట్టిందా..రాష్ట్రం పెట్టిందా…ప్రతీ రైతుకు…ప్రతీ ఎకరానికి పది వేలు రూపాయలు ఇస్తున్నం. ఇందులో పైసా మీది ఉందా…మేం పేర్ల మార్చి ప్రచారం చేసుకుంటున్నమని మీరు చెబుతున్నరు. రైతు బందు కేసీఆర్ ఆత్మ నుండి పుట్టింది. రైతు బీమా ఇందులో మీది ఒక్క రూపాయి ఉందా..అని అడిగారు. 24 గంటల ఉచిత విద్యుత్ మేం కాపీ కొట్టినమా… ఏ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన రాష్ట్రం ఉందా…బాన్సూవాడలో తిరుగుతున్నరు కదా రైతును అడగండి నిర్మల గారు. రైతు బందు, రైతు బీమా ఎలావస్తుందో అడగండని సూచించారు.

కేంద్ర మంత్రిగా రేపటి బడ్జెట్ లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వండి. రైతు బంధు ఇవ్వండి..రైతు బీమాఇవ్వండి..బాన్సువాడలో కారు దిగి రైతను పలకరించండి. వడ్లు ఎలా కొన్నమో…రైతు బందు ఎలా ఇచ్చినమో…5 లక్షల బీమాఎలా ఇచ్చినమోఅడంగండి రైతులు చెబుతరా. అలాంటి పథకాలు దేశంలోపెట్టండి..దేశం సంతోషిస్తుందని తెలియజేసారు.

2016 ఆసరా పెన్షన్ పేరు మార్చినమా..షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లో మీది ఒక్క రూపాయిఉందా. కేసీఆర్ కిట్ లో మీ భాగస్వామ్యం ఉందా.. ఎందుకు మీ స్థాయి తగ్గించుకుంటున్నరు. కేంద్ర పథకాలు మేం ప్రచారం చేసుకుంటున్నమట..కర్ణాటక పోదాం పద..మీ కేంద్రమే డబ్బులు ఇస్తే…కర్ణాటకలో రైతు బీమా ఉందా…2016 పెన్షన్ ఉందా..కళ్యాణ లక్ష్మి ఉందా..రైతు బీమా ఉందా..ఉచితవిద్యుత్ ఉందా… మహరాష్ట్ర పోదామా…మీ పథకాలు అయితే అన్నిరాష్ట్రాల్లో అమలు కావాలి కాదా..అనిఅన్నారు .

అసలు నిజం రైతు బంధును మీరు సగం కాపీ కొట్టి ఎకరానిక ఆరువేలే ఇచ్చి కొందరికే ఇస్తున్నరు. మేం అందరికీ ఇచ్చినం. ప్రతీ ఎకరానికి పదివేలు ఇచ్చినం. కిసాన్ సమ్మాన్ యోజన అని పేరు పెట్టుకున్నరు. రైతు బంధును కాపీ కొట్టి. మిషన్ భగీరథ ప్రధాని వచ్చి స్వయాన నల్లా ఇప్పారు గజ్వేల్ లో. అది తెలంగాణ నిధులతో చేసింది. మీరు హర్ ఘర్ కో జల్ అని మీరే కాపీ కొట్ట్రిండ్రు. కళ్యాణ లక్ష్మిని మీరు కాపీకొట్టిండ్రు.. అర్థ సత్యాలు. అవాస్తవాలు మీవని దుయ్యబట్టారు.

మన ఊరు- మన బడి కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. ఇంత పచ్చి అబద్జాలు మాట్లాడితే ఎలా.. ఇవాళ రాష్ట్రం సర్ ప్లస్ నుండి డెఫిసిట్ కు పోయిందని చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు లోటు 22 వేల 548 కోట్లు ఉంది. కర్ణాటక 19 వేల 338 కోట్ల లోటు బడ్జెట్. కేంద్రం ఎప్పుడూలోటు బడ్జెట్. మీరే కేంద్ర ఆర్థిక మంత్రి, 8ఏళ్లలో మీరు ఎప్పుడు సర్ ప్లస్ బడ్జెట్ ఉంది. మీరుఅప్పుల దేశంగా మార్చారని అనలేమా…కరోనా వచ్చి మీరే ఆర్థిక వ్యవస్త దెబ్బ తినకూడదని అప్పులు తీసుకోమన్నరు. డిస్క్ం ల అప్పులు రాష్ట్రాల మీద వేశారని మండిపడ్డారు.

ఫసల్ బీమా అమలు కావడంలేదని నిర్మలా సీతారామన్ అన్నారని, ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు కావడం లేదో ముందు సమాధానం చెప్పి, మమ్ముల్ని అడగాలని విమర్శించారు. అది దండగ, రైతులకు మేలు జరగదని గుజరాత్ రాష్ట్రమే తిరస్కరించిందని, దీని సమాధానం మీరే ఇవ్వాలని అన్నారు.

నేను ప్రతీప్రశ్నకు ఆన్సర్ ఇచ్చా…నేను అడిగిన దానికి నిర్మలాసీతారామన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర మంత్రులు రావడం అబద్దాలు మాట్లాడటం అలవాటైందని అన్నారు. పార్లమెంట్ లో నిజాయితీగా చెప్తరు. గల్లీలో అబద్దాలు మాట్లాడతరని, స్థాయిని దిగజార్చుకోని మాట్లవద్దని నా సూచన అని మంత్రి హరీష్ రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *