mt_logo

‘తెలంగాణ విజయ గర్జన’ సభా స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్

నవంబర్ 15న వరంగల్ లో నిర్వహించబోయే టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభ కోసం రాంపూర్‌ సమీపంలోని స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పరిశీలించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా “విజయ గర్జన సభ” నిర్వహించేందుకు పార్టీ భారీ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగలీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. తాజాగా వినోద్ కుమార్‌తో కలిసి రాంపూర్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించి, అక్కడి రైతులతోనూ మాట్లాడారు. కాగా, టీఆర్ఎస్ విజ‌యగర్జన సభను 10లక్షల మందితో విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *