mt_logo

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం

తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్‌సభ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చించారు.

ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు.

ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కేసీఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.