ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కేసీఆర్ ‘మహిళాబంధు’ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. మహిళల సాధికారత కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మిషన్ భగీరథ వంటి అనేక పథకాలను కీర్తిస్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ జై హో అంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సత్తుపల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద అర్హులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, చీరలను పంపిణీ చేసి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ‘మహిళాబంధు’ సంబరాలు నిర్వహించాలని అని తెరాస పార్టీ అధ్యక్షులు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో 130 అడుగుల అవరణలో రంగవల్లులతో మహిళల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతిబింబిస్తూ కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ పథకాలను తెలిపే విధంగా హిందూ,ముస్లిం, క్రైస్తవ మత వివాహ సాంప్రదాయాలతో చిత్రాలను గీసి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వదిస్తున్నట్లు ముగ్గులతో తీర్చిదిద్దారు. కళ్యాణ లక్ష్మికి 10 లక్షల 50 వేల చెక్కులు అంటూ తలంబ్రాలతో గీశారు. అదే విధంగా 11 లక్షల తల్లులకు కేసీఆర్ కిట్లు అంటూ రంగవల్లులను అలంకరించారు. ఈ రంగవల్లులు చుట్టూ మహిళలు కెసిఆర్ జై హో, థాంక్యూ కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ రంగవల్లుల సంబురాల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- KTR goes all guns blazing; poses several questions to PM Modi
- Hyderabad is collapsing due to Congress ruling: KTR
- Congress, BJP to draw blank, BRS to win 3, and MIM to win 1 LS seat in GHMC
- Rahul Gandhi misled Telangana by claiming Congress govt. giving Rs. 2,500 to women: KTR
- BRS alleges EC ignoring complaints lodged against Congress leaders
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది.. రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
- ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్
- తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు
- రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్
- బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- మైనార్టీల కోసం 204 పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా: మైనార్టీల సమావేశంలో కేటీఆర్
- పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడుకి, భూగర్భ కార్మికుడికి.. ఈశ్వరునికి, కోటీశ్వరునికి.. గుణవంతునికి, ధనవంతునికి మధ్య పోటీ: కేటీఆర్
- అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. బండి సంజయ్ చేసిందేమి లేదు: కేటీఆర్
- వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి.. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలి: హరీష్ రావు