mt_logo

రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ప్రభుత్వ పథకాల అమలుపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఏ ఊరికి రమ్మన్నా వచ్చి అక్కడ ప్రభుత్వ పథకాలు చూపిస్తానని అన్నారు. శనివారం ఎల్లారెడ్డిపేట్ మండ‌లం వెంక‌టాపూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు పోతోంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని కేంద్రమే గణాంకాలు వెల్లడించింది. రాజ‌కీయం, ప్ర‌జాజీవితంలో సంతోషం ఎక్క‌డ అనిపిస్తుందంటే.. ఇది పేద‌వాడి ప్ర‌భుత్వ‌మ‌ని సునీత చెప్పిన‌ప్పుడు సంతోష‌మేసిందన్నారు. అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయని, భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి ఇస్తున్న ప్రభుత్వం తమదేనని తెలియజేశారు. బీజేపీ,కాంగ్రేస్ నాయకులను ఉద్దేశించి, మీరు ప‌రిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మించారా ? అని ప్ర‌శ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ‌కు మీరు ఏ ఊరికి ర‌మ్మంటే ఆ ఊరికి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. మాట‌లు చెప్ప‌డం ఈజీ అని… ప‌నులు చేయ‌డం క‌ష్టమని, విమ‌ర్శ‌లు చేసే ముందు ఏం చేశారో చెప్పాలని అన్నారు. తెలంగాణలోని ప్ర‌తి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జ‌రుగుతోందని అని తెలిపిన మంత్రి కేటీఆర్… వెంక‌టాపూర్ కూడా అభివృద్ధి బాట‌లో ముందుకెళ్తోందన్నారు. సిరిసిల్ల రూపుమార్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుందని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *