రానున్న యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం జలసౌధలో సమావేశమైంది. ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీటిని విడుదల చేయాలో నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో.. భారీ ప్రాజెక్టుల ద్వారా సుమారు 29 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 342 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రచించారు.
![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2011/09/jurala-project.jpg?resize=436%2C280&ssl=1)