mt_logo

గల్వాన్ అమరుల కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్

గల్వాన్ ఘటనలో మృతి చెందిన జార్ఖండ్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించి, ఒక్కో కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయం అందించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్‌ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్‌ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చి, అన్ని వేళలా తాము అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిచ్చారు. అంతక ముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బిర్సాముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో సమావేశమయ్యి, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై ప్రధానంగా చర్చిస్తునట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *