mt_logo

యాదగిరిగుట్ట వద్ద సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సందర్శించారు. సీఎం ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికోసం ఆర్కిటెక్ట్ లతో కలిసి ఏరియల్ సర్వే చేపట్టారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కళ్యాణకట్ట, పుష్కరిణి, వసతిగృహాలను కాలినడకన పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ సమగ్రాభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *