mt_logo

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సీఎం కేసీఆర్ ఆర్థిక చేయూత

ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి ఆర్థిక సహకారాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు సీఎం కేసీఆర్. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం రేవ‌ల్లికి చెందిన ఓ యువతి పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌తో ప్రాణాలు నిలిపే అవ‌కాశం ఉన్నాగానీ, చికిత్సకు 30 లక్షల వరకూ ఖర్చు అవుతుండటంతో.. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది పోయింది. కాగా బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వ‌చ్చినా కూడా.. ఈ వ్యాధి కార‌ణంగా చ‌దువుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. చివరకు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి రేవల్లి గ్రామస్తులు తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి తండ్రిని పిలిపించి మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పెద్దమనసుతో ఆ యువతి చికిత్స నిమిత్తం 25 లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. దీంతో సదరు యువతికి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *