ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి ఆర్థిక సహకారాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు సీఎం కేసీఆర్. వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ యువతి పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ప్రాణాలు నిలిపే అవకాశం ఉన్నాగానీ, చికిత్సకు 30 లక్షల వరకూ ఖర్చు అవుతుండటంతో.. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది పోయింది. కాగా బాధితురాలికి ఎంబీబీఎస్లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి రేవల్లి గ్రామస్తులు తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి తండ్రిని పిలిపించి మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పెద్దమనసుతో ఆ యువతి చికిత్స నిమిత్తం 25 లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. దీంతో సదరు యువతికి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్