దేశ జనాభాలో అధిక శాతం మంది పేదవాళ్లే అని, కేంద్రమైనా లేక రాష్ట్రమైనా.. వారి కోసం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని, వాటిని ఉచితాలుగా చూడొద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితాలుగా చిత్రీకరిస్తున్నట్లు కవిత ఆరోపించారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అనడం పేదల్ని అవమానించడమేనని, ఆ పథకాలను ఉచితాలుగా పిలువరాదని బీజేపీని కవిత కోరారు.పేదల ఆరోగ్యం, వ్యవసాయం, పిల్లల చదువుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఇవి ఏవీ కూడా ఉచితం కాదని, ఇటీవల కార్పొరేట్ బ్యాంకులను లూటీ చేసిన వారికి 10 లక్షల కోట్ల రుణాన్ని ఎత్తివేయడం ఉచితం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతు ఇవ్వాలని, మద్దతు ఇవ్వకున్నా కనీసం స్వేచ్ఛను ఇవ్వాలని కవిత సూచించారు. ఉచిత స్కీమ్లను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర వత్తిడి తెస్తున్న తీరు సరిగా లేదని, వెంటనే ఆ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు.
- Telangana Bhavan will be our centre of activity: KTR
- Musical chair game for CM post begins in the Congress party
- KCR honourably gives up all his official protocol
- We will accept the public mandate: BRS working president KTR
- BRS working president KTR asked cadre not to lose heart
- Centre intervenes in Nagarjuna Sagar dam row
- Three-fold GSDP growth in Telangana in the last 10 years
- All arrangements in place for counting of votes in Telangana
- Polling percentage came down in Telangana
- CM KCR confident of BRS party’s victory in assembly polls
- సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్గా ఉంటుంది… మేమే గెలుస్తున్నాం: కేటీఆర్
- ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్.. కామారెడ్డిలో కర్ణాటక ఎమ్మెల్యే
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్