mt_logo

షాదీముబారక్, కల్యాణలక్ష్మితో బాల్యవివాహాలకు అడ్డుకట్ట : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మానవతా విలువలతో కూడిన పరిపాలన నడుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి… కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదని, దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవేనన్నారు. సంప్రదాయం పేరుతో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న బాల్య వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అడ్డుకట్ట వేసినట్లయిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఐకమత్యం పెంపొందించాలనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *