పిల్లలు, మహిళల సంరక్షణ కోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఎన్జీఓ బచ్పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) సంస్థ ఇకపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర బాలల రక్షణ సంఘం (ఎస్సీపీఎస్), మహిళ, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ), పోలీసుశాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం (డబ్ల్యూఎస్డబ్ల్యూ)తో బీబీఏ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బలవంతంగా పని చేస్తున్న, బందీలుగా ఉన్న కార్మికు లు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, మహిళల రక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, వారిని రక్షించి తిరి గి సమాజంలో కలిసి పోయేలా చేయడం, పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 12,500 గ్రామాలను ‘బాలల స్నేహపూర్వక గ్రామాలు’గా మార్చడమే లక్ష్యంగా మూడేండ్ల కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించింది. ఈ కార్యక్రమంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ఐసీపీఎస్ నోడల్ అధికారి శారద, స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి రాకేశ్తో బీబీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్, సీనియర్ అధికారులు ఎం చందన పాల్గొన్నారు.
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన