mt_logo

ఆశావర్కర్లకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్నవాటితో కలుపుకొని 30 శాతం ఇంటెన్సివ్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మరియు ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలందరికి ఈ పెంపు వర్తించనుంది. ప్రభుత్వ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం నెలవారీ ప్రోత్సాహకాలు 7500 నుంచి 9750కి పెరగనున్నాయి. 2021 జూన్‌ నుంచి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కరోనా మహమ్మారి ఉదృతంగా ప్రబలిన సమయంలోనూ ధైర్యంగా విధులు నిర్వహించిన ఆశాకార్యకర్తలకు సీఎం కేసీఆర్ ఇది వరకే రెండుసార్లు ఇంటెన్సివ్స్ పెంచగా.. తాజాగా ఇది మూడవ ఇంటెన్సివ్. ఇక అడగకముందే తమకు ఇంటెన్సివ్స్ పెంచడం పట్ల ఆనందంలో మునిగి పోయారు ఆశాకార్యకర్తలు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *