mt_logo

నిర్మల్ లో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు.. పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సీఎం కేసీఆర్ ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ల‌క్ష్మ‌ణ‌చాంద‌ మండ‌ల కేంద్రంలోని రైతు వేదికలో రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన రైతు బంధు వారోత్స‌వాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినిలు, మహిళలు వేసిన తెలంగాణ రైతు బంధు, సీయం కేసీఆర్ ముగ్గుల‌ను ఆసక్తిగా తిలకించి, వారిని అభినందించారు. ముగ్గుల పోటీలు, వ్యాస ర‌చ‌న పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. గ‌తంలో వ్య‌వ‌సాయం దండ‌గా అంటే స్వ‌రాష్ట్రంలో వ్యవ‌సాయాన్ని పండుగ‌లా మ‌ర్చార‌న్నారు. రైతు బంధు ప‌థ‌కం ద్వారా రెండు పంట‌ల‌కు పెట్టుబ‌డి స‌హాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్పుల బాధ‌తో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌లు పండగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *