mt_logo

నేడు ఇ-గవర్నెన్స్ జాతీయ సదస్సు.. అధ్యక్షత వహించనున్న మంత్రి కేటీఆర్

24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 ఈరోజు మరియు రేపు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ‘ఇండియాస్ టెకేడ్ : డిజిటల్ గవర్నెన్స్ ఇన్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్‌.’ ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సులో ఆత్మ నిర్భర్ భారత్, పబ్లిక్ సర్వీసెస్ యూనివర్సలైజేషన్, ఇన్నోవేషన్ – ప్లాట్‌ఫార్మైజేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండియాస్ టెకేడ్ – డిజిటల్ ఎకానమీ (డిజిటల్ పేమెంట్స్ – బిల్డింగ్ సిటిజన్స్ కాన్ఫిడెన్స్) వంటి పలు అంశాలపై స్పీకర్ సెషన్‌లు కూడా ఉంటాయి. ఈరోజు సదస్సులో నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్- 2021 ప్రధానం చేయబడుతాయి.

ఇ-గవర్నెన్స్ పై నిర్వహిస్తున్న ఈ కాన్ఫరెన్స్ ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల ప్రభావవంతమైన అమలును గుర్తించడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలోని ఉన్నతాధికారులు, ఇ-గవర్నెన్స్‌ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడంతో పాటు ఇ-గవర్నెన్స్ లో ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తారు. ఈ వేదిక ద్వారా ఇస్తున్న అవార్డులు ఇ-గవర్నెన్స్, డిజిటలైజేషన్‌ రంగాల్లో కృషి చేస్తున్న వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో నిర్ధారించిన థీమ్‌లు, సబ్-థీమ్స్ లపై పలు సెషన్స్ తో పాటు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *