mt_logo

హైదరాబాద్ అభివృద్ధికి రూ.5177 కోట్లు విడుదల

హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం ఒక్కరోజులో రూ.5177 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను గురువారం విడుదల చేసింది. దీంతో నగరాభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను మరోసారి చేసినట్లయ్యింది. వచ్చే 15 ఏళ్ల జనాభాను అంచనా వేసి తాగునీరు, మురుగుశుద్ధి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకున్నా ఔటర్‌ లోపలి 190 గ్రామాల్ల్లో ఈ సమస్య అధికంగా ఉంది. దీని శాశ్వత నివారణకు జీహెచ్‌ఎంసీ-ఔటర్‌ లోపలున్న ప్రాంతాలకు దాదాపు 2108 కిలోమీటర్ల మేర తాగునీటి వ్యవస్థ కోసం రూ.1200 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 25 ఎస్టీపీల ద్వారా నిత్యం 77.2 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, అదనంగా మరో 126 కోట్ల లీటర్ల మురుగును శుద్ధి చేసేందుకు నూతనంగా 31 సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866.21 కోట్లు మంజూరు చేసింది. దీనికితోడు గ్రేటర్‌ చుట్టుపక్కల 17 చోట్ల ప్రారంభించిన ‘డబుల్‌’ ఇండ్ల సముదాయాల్లో అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.51 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *