mt_logo

టీఆర్ఎస్ తోనే తెలంగాణ పునర్నిర్మాణం- కవిత

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ తోనే సాధ్యమని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు.  బుధవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఆంధ్రాబాబు చంద్రబాబును తరిమి కొట్టాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే బీజేపీ, తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే నరేంద్రమోడీ పాలన రాదని, చంద్రబాబు, వెంకయ్యనాయుళ్ళ పాలన వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో గెలవలేమనే ఓటర్లను మభ్య పెట్టడానికి ఆ రెండు పార్టీలు సినిమా హీరోలను ప్రచారానికి వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు తనను ఎంపీగా గెలిపిస్తే ఊహించని పద్ధతిలో అభివృద్ధి చేస్తానని కవిత చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *