mt_logo

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పేర్వారం రాములు..

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్(టీఎస్టీసీసీ) చైర్మన్ గా టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు ప్రభుత్వంలో సముచిత పదవి ఇవ్వాలని, ఇందులో భాగంగానే సాహిత్యం, కళలు, పర్యాటకరంగంలో అనుభవం ఉన్న పేర్వారంకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లయితే ఆ రంగాన్ని ఆయన విశేషంగా అభివృద్ధి చేయగలరని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రెండుమూడు రోజుల్లో ఈ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *