mt_logo

వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరి వెళ్ళారు. జిల్లాకు చేరుకున్న సీఎం వరంగల్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్ టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, వరంగల్ నగర అభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిపారు. వరంగల్ నగర అభివృద్ధి, ఇతర అంశాలపై త్వరలో ఒక నివేదిక అందజేయాలని అధికారులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫ్లై ఓవర్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, స్పీకర్ మధుసూదనాచారి, పార్లమెంటరీ సెక్రెటరీ వినయ భాస్కర్, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *