mt_logo

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పోలీస్ శాఖ

చలాన్లు చెల్లించాల్సిన వాహనదారులకు పోలీస్‌ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు రాయితీలతో చలాన్లు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌తో పాటు లోక్‌అదాలత్‌ ద్వారా చెల్లించే వీలు కల్పించింది పోలీస్ శాఖ. ద్విచక్ర, త్రిచక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా… మిగిలిన 25శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్‌ మోటార్‌ వాహనాలు మరియు హెవీ మోటార్‌ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్‌ కేసుల్లో రూ.900 వరకు మాఫీ ప్రకటించింది. గత రెండు సంవత్సరాల కోవిడ్‌ పరిస్థితుల వల్ల జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతుండగా… ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *