తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేస్తే, కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణను గాలికి వదిలేసింది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లో ప్రారంభమైన ‘నదుల పరిరక్షణ’ జాతీయ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని, ప్రసంగించారు. నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసిందని… నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో నదులు సజీవమయ్యాయని, అందుకు గోదావరి నది సాక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నదులు కలుషితమై పోతున్నా పట్టించుకోవడం లేదని, ఏ విధమైన సంరక్షణ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నదులు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాల్లోని చెత్తను వాగుల్లో కలపకుండా ప్రతీ గ్రామంలో చెత్తను సేకరించి ప్రత్యేక డంపింగ్ యార్డుల్లో నిల్వ చేసి, దాన్ని ఎరువుగా మార్చి, రైతులకు అందిస్తున్నామని మంత్రి అన్నారు. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీలను పెంచుతోందని పేర్కొన్నారు. పచ్చదనం వల్ల కూడా నదులు కలుషితం కాకుండా కాపాడవచ్చని, తెలంగాణ వచ్చిన తర్వాతి ఈ ఏడు సంవత్సరాల్లో మూడు శాతం పచ్చదనం పెరగడానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన హరితహారమే కారణమన్నారు. అతి తక్కువ కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో, సాగు విస్తీర్ణం పెరిగి, వలసలు పూర్తిగా తగ్గిపోయి ఇపుడు పంటకోతల సమయంలో తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారని అన్నారు. నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలతోపాటు ఇతర సంస్థలు కూడా పాటు పడాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- Revanth’s decision to reduce Telangana districts arbitrary and shortsighted
- Revanth Reddy, the most dedicated karyakarta of the BJP, writes KTR
- 6 reasons why the Congress can’t fight the BJP
- How Congress secretly boosting BJP’s chances in 6 seats in Telangana, writes Padma Rao Goud
- Revanth Reddy is a pathological liar and cheating people in a phased manner: KTR
- తెలంగాణలో జిల్లాల కుదింపు నిర్ణయం అసంబద్ధం, అవివేకం
- బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే: హరీష్ రావు
- కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్గిరి కార్యకర్తలతో కేటీఆర్
- లోక్సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు
- బండి సంజయ్కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టింది: కేటీఆర్
- మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్
- కరీంనగర్లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు