mt_logo

నేడు ఎనిమిది బిల్లులకు ఏకగ్రీవ తీర్మానం తెలిపిన తెలంగాణ శాసనసభ

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎనిమిది బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ వాటికి ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభలో ప్రవేశ పెట్టగా… విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులను ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశ పెట్టారు. జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, అజమాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లును ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టగా… తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు. శాసన సభ వీటన్నిటికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *